
ఉత్తమ ఫలితాలు సాధించిన
మోడల్ స్కూల్ విద్యార్థులకు
అభినందన పురస్కారాలు
2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు 85.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగా
వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉదయం అభినందన సభ జరిగింది. సభలో
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధినీ విద్యార్థులను అభినందించి సత్కరించారు.
బోయిలపల్లి హనుమంతు అనే విద్యార్థి 600 మార్కులకు 580 మార్కులతో పాఠశాల స్థాయిలో ప్రధమంగా నిలచారు. ప్రధమ శ్రేణిలో
ఉత్తీర్ణుడైన బి. హనుమంతుకు పాఠశాల తరఫున ఆరు వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు.
గోనుగొడుగు దిషికా రాణి 570, ఆయిల జ్యోషిక 565 మార్కులు సాధించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
96 మంది పరీక్షలు రాయగా 67 మంది ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 26 మంది 500లకు పైబడి మార్కులు సాధించారు.









